సోఫియా ఇండియా ( ఎ చారిటబుల్ అండ్ నాన్ప్రాఫిట్ కార్పొరేషన్) మెరిట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను కోరుతోంది. మొదటి సంవత్సరం ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు అర్హత కలిగి ఉంటారు.
ఇందులో భాగంగా... ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు నాలుగేళ్ళకుగానూ మొదటి సంవత్సరానికి ఏడు వందల డాలర్లు, ఆ తరువాత మూడేళ్లపాటు సంవత్సరానికి 600 డాలర్ల చొప్పున స్కాలర్ షిప్లను అందజేస్తారు.
అలాగే... మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఐదేళ్ళకుగానూ మొదటి ఏడాది 700 డాలర్లు, ఆ తరువాత మూడేళ్లపాటు ఏడాదికి 600 డాలర్లు, చివరి సంవత్సరం 300 డాలర్లను అందజేస్తారు.
విద్యార్థులు చేయవలసిందల్లా... మొదట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సోఫియాస్కాలర్షిప్.ఆర్గ్ అనే వెబ్సైట్ నుంచి ఈ స్కాలర్షిప్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలి.
తరువాత ఆ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదువుతున్నట్లుగా చూయించే సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన ఇంటర్ మార్కుల జాబితాను దరఖాస్తులో చెప్పిన అడ్రస్సుకు పంపించాల్సి ఉంటుంది. ఈ ఫారాలను నమోదు చేసేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 30, 2008. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పైన చెప్పిన వెబ్సైట్ను చూడవచ్చు.