విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్/ఇంజనీర్స్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రెండు విభాగాల్లో ఖాళీగా ఉన్న 34 పోస్టులను అర్హులైన అభ్యర్థులతో ఎంపిక చేయనున్నారు.
ఎమ్మెస్సీ కెమిస్టీలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎంఈ/ఎంటెక్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులయ్యే వారికి 15,600 నుంచి 39,100 రూపాయల వరకు వేతనంగా చెల్లిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.