కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్)లో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 74లమేర ఉండగా, అందులో జనరల్ క్యాటగరీ కింద 36, ఓబీసీ కింద 17, ఎస్సీలకు 9, ఎస్టీలకు 12 సీట్లు కేటాయించారు.
ఇంటర్ లేక తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై షార్ట్హ్యాండ్లో నిమిషానికి 80 ఆంగ్ల పదాలు రాయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాలి. అలాగే టైపింగ్లో నిమిషానికి 30 పదాలు రాయగలిగి ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ పదవిలో 234 పోస్టులు ఉండగా, అందులో 96పోస్టులను జనరల్ క్యాటగరీ కింద, ఓబీసీ కింద యాబై, ఎస్సీలకు 29, ఎస్టీలకు 17, మాజీ సైనికోద్యోగులకు 42 పోస్టులను కేటాయించారు. ఇంటర్ లేక తత్సమాన పరీక్ష పాసై, నిమిషానికి 30 ఆంగ్ల పదాలు టైప్ చేయగలిగి ఉండాలి.
ఈ రెండు ఉద్యోగాలకు ఆగస్టు 1నాటి ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. పురుషులకైతే 167.5 సెంమీల ఎత్తు, సాధారణ స్థితిలో ఛాతీ కనీసం 81 సెంమీలు ఉండాలి. మహిళలకైతే 157 సెంమీల ఎత్తు ఉండాలి.
రాత పరీక్ష, టైపింగ్, స్టెనోగ్రఫీ, మౌఖిక పరీక్షలు ఉంటాయి. కంటి చూపు లోపం ఉన్నవారు, అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోకపోవడం మంచిది. ఇతర వివరాలకు సెప్టెంబర్ 6-12 తేదీల నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పత్రిక చూడగలరు.