ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుక్రవారం వర్క్షాపు జరుగనుంది. కాకినాడలో జరిగే ఈ వర్క్షాపును ది హిందు ఎడ్యుకేషన్ ప్లస్, కేఎల్.విశ్వవిద్యాలయం సంయుక్తంగా రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాయి. ఎంసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ భవిష్యత్ కోసం ఎంచుకోవాల్సిన కోర్సులపై నిపుణులు మంచి అవగాహన కల్పిస్తారు.
ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం ఈ వర్క్షాపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడికల్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాగుతుంది. ఈ వర్క్షాపులో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ పేర్లను 0884-2366379 అనే ఫోన్ నంబరులో నమోదు చేయించుకోవచ్చు. లేదా వర్క్షాపు ప్రారంభానికి గంట ముందు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.