భారత నౌకాదళంలో అర్హులైన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి యాంత్రిక్స్, నావిక్స్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. యాంత్రిక్స్ విభాగంలో దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ళ డిప్లొమా ఇన్ మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్స్ (రేడియా), (పవర్) ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, జనవరి ఒకటి 1998 నుంచి జనవరి 1వ తేదీ 1992 మధ్య కాలంలో జన్మించిన వారై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.5200 నుంచి 20200 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.
అలాగే, నావిక్స్ (జనవర్ డ్యూటీ) విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు, సంస్థ నుంచి ఇంటర్మీడియట్లో గణితం, ఫిజిక్స్ విభాగాల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు రూ.5200 నుంచి 20200 రూపాయలు చొప్పున నెల వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులను వచ్చే నెల ఆరో తేదీలోగా చేరవేయాల్సి వుంటుంది.