Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీమా ఏజెంట్ల నియామక పరీక్ష

Advertiesment
ఐఆర్డిఎ
ఐఆర్‌డిఎ బీమా రంగాన్ని కాపాడటంతో పాటు బీమా పాలసీదార్ల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ రెండు ప్రధాన లక్ష్యాలు ఒక్కటికొకటి ముడిపడి ఉన్నాయి. పాలసీదార్ల సంక్షేమం చూడనిదే బీమా రంగం కావలసిన వృద్ధిని సాధించలేదు. గ్రామీణ పాలసీదార్లు నిరక్షరాస్యులు లేదా ఆర్థికంగా నిరుపేదలు అయినందువల్ల పాలసీదారుల రక్షణ, సంక్షేమమే ఐఆర్‌డిఎ ప్రధాన లక్ష్యం. ఈ పరిస్థితుల్లో పాలసీదార్లలో అవగాహన కల్పించేందుకు ఏజెంట్లు గ్రామీణ బీమా పాలసీదార్లకు బీమా పథకాలు వివరించడం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం ప్రధాన కర్తవ్యం.

కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి యుఎల్ఐపి వంటి పథకాల విషయంలో పాలసీదార్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం ఏజెంట్ల విధి. అందువల్ల ఈ విధులు సక్రమంగా నిర్వహించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు తగిన ఏజెంట్లను నియమించేందుకు ఐఆర్‌డిఎ ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో తగిన ఏజెంట్ల నియామకానికి పరీక్ష నిర్వహించేందుకు ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఐఐఐ) పూర్తి మద్దతు ఇస్తోంది.

ఈ క్రమంలో ఐఐఐ, శిక్షణా సంస్థలు, పరీక్ష నిర్వహణా కేంద్రాల సిబ్బంది పట్ల గత కొంతకాలంగా ఐఆర్‌డిఎకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదుల్లో ప్రధానంగా మాస్ కాపీయింగ్, దొంగ అభ్యర్థులు, పరీక్ష తేదీకి ముందే జవాబు పత్రాలు అందించడం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ అభ్యర్థి అయినా పరీక్షా కేంద్రానికి డబ్బులు చెల్లించకపోతే ఆ అభ్యర్థి జవాబు పత్రాలను పరీక్షా కేంద్రాల్లో మార్చి వేస్తుంటారు. అయితే ఇటువంటి కొన్ని పరీక్షా కేంద్రాలను ఐఐఐ రద్దు చేసినప్పటికీ, ఇంకా కొన్ని కేంద్రాలు అభ్యర్థుల పట్ల ఇబ్బందికరంగానే పనిచేస్తున్నాయి.

మామూలుగా నిర్వహించే పరీక్షల విషయంలో ఇప్పటికీ అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటువంటి కేంద్రాలు పూర్తిగా పరీక్షా విధానాన్ని భ్రష్టు పట్టించి బీమారంగాన్ని అపహాస్యం చేస్తున్నాయి. పరీక్షా విధానంలో ఇటువంటి అక్రమాల వల్ల బీమా సంస్థలు, ఐఆర్‌డిఎ ప్రతిష్ట బాగా దెబ్బతింది. అంతేకాక, గ్రామీణ ప్రాంతాల్లో బీమా ఏజెంట్లు కొన్ని పథకాలను విక్రయించడంలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు అందాయి.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏజెంట్లకు తగిన శిక్షణ ఇవ్వకపోవడమేనని బీమా సంస్థలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఒక పరీక్ష నిర్వహించి ఆ తర్వాతనే అర్హత పరీక్ష నిర్వహించాలని ఆగస్టు 17, 2007న ఐఐఐ నిర్ణయించింది. ఈ పరీక్ష ఆగస్టు 15, 2008లోగా నిర్వహించాలని కూడా నిర్ణయించింది.

ఏజెంట్లుగా నియమించబోయే అభ్యర్థులకు పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హత పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఎస్ఈ ఐటి నిర్ధేశించింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించడానికి పూనుకుంది. తక్కువ స్థాయి విద్యార్హత గల అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడంలో ఎస్ఎస్ఈ ఐటి మంచి అనుభవం ఉన్న ప్రముఖ సంస్థ. దేశవ్యాప్తంగా 10/12 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించే అనుభవం, అర్హత, సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. అంతేకాక.. ఈ సంస్థకు 25 కేంద్రాలున్నాయి. ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యే 10/12 తరగతుల అభ్యర్థుల సామర్థ్యంపై అపోహలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీమా ఏజెంట్ల సామర్థ్యం పెంచేందుకు ఐఆర్‌డిఎ చిత్తశుద్ధితో ఉంది.

ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇవి పట్టణ ప్రాంతాలకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల అభ్యర్థుల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతున్నాయి. ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహించేందుకు 150కి పైగా కేంద్రాలున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆన్‌లైన్ కేంద్రాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వీటిని కూడా ఆన్‌లైన్ కేంద్రాలుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

జాతీయ భాషల్లో ఆన్‌లైన్‌లలో పరీక్ష రాసే అభ్యర్థులతో పాటు ఇతర భాషా అభ్యర్థుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హింది, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మళయాళం, తమిళ భాషల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu