ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం వెయ్యి పోస్టులకు గాను జనరల్ కేటగిరీలో 495, ఓబీసీకి 263, ఎస్సీకి 146, ఎస్టీకి 96 చొప్పున పోస్టులను రిజర్వు చేశారు.
ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు వేతన శ్రేణిగా రూ.14500-25700/- చొప్పున చెల్లిస్తారు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు కనీస 60 శాతం (ఎస్టీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పైపెచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు జనవరి ఒకటో తేదీ 2011 నాటికి 21 నుంచి 30 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు) మించి ఉండరాదు. పోస్టుల ఎంపికరాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. దరఖాస్తు ఫీజును రూ.400 (ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులకు రూ.50) చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2011 మార్చి ఒకటో తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. రాత పరీక్ష 211 మే 11వ తేదీన నిర్వహిస్తారు. మిగిలిన వివరాలకు ఐఓబీ వెబ్సైటులో చూడొచ్చు.