ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో (ఏటీబీపీ)లో కానిస్టేబుల్/పయినీర్ (ఎలక్ట్రీషియన్, మేసన్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, బ్లాక్స్మిత్ మొదలగు) ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగాలకుగానూ పోస్టుల ఖాళీల సంఖ్య 286 కాగా... జీతం స్కేలు 3050 రూపాయల నుంచి 4,590 రూపాయల మధ్య ఉంటుంది. దరఖాస్తు చేయబోయే అభ్యర్థులకు అక్టోబర్ 15, 2008 నాటికి వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
కావాల్సిన అర్హతలేంటంటే... పదవ తరగతి లేదా తత్సమాన విద్యార్హతలు. ఏదేని సంస్థలో ఒక ఏడాదిపాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. పై ఉద్యోగాలకుగానూ సంబంధిత ట్రేడ్లో ఇండస్ట్రియల్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
పై ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు 50 రూపాయల పోస్టల్ ఆర్డర్ను పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు కలదు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను "ది ఇన్స్పెక్టర్ జనరల్ (సెంట్రల్) జోన్, ఏటీబీపీ, టిఐజిఆర్ఐ కాంపీ, పి.ఒ.మడంగిట్, న్యూఢిల్లీ- 110 062. అనే చిరునామాకు పంపగలరు. కాగా, దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అక్టోబర్ 15.