రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యంగ్ స్కాలర్స్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని బ్యాంకింగ్ రంగ వ్యవస్థపై యువతకు సరైన అవగాహన కల్పించడానికే ఈ అవార్డును ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
దరఖాస్తు వివరాలు.. ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. డిగ్రీ చదువుతున్న వారై ఉండాలి. 2009, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు వారై ఉండాలి. దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష ద్వారా ఈ అవార్డుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్ష ద్వారా 150 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ పరీక్షలో ఆర్బీఐతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల వ్యవహారాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ వ్రాత పరీక్షలో అత్యుత్తమ మార్కులతో ఎంపికైన అభ్యర్థులు.. రెండు లేదా మూడు నెలలు ఆర్బీఐ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలు నిర్వర్తించే కాలంలో.. సదరు అభ్యర్థులకు నెలకు .. రూ. 7,500 మేరకు చెల్లిస్తారు.
రాష్ట్రంలోను వివిధ పరీక్షా కేంద్రాలు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. హైదరాబాద్, కడప, కరీంగర్, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరూ, వరంగల్, విజయవాడ, సికింద్రాబాద్. రాత పరీక్ష నిర్వహించు తేది. 2010, జనవరి 10.
దరఖాస్తులను ఆన్లైన్ లేదా పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. దరఖాస్తులు పంపుకోవలసిన ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 21. కాగా, పూర్తి చేసిన దరఖాస్తులను పంపుకోవలసిన చిరునామా దిగువున ఇవ్వబడింది.
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్,
ఆర్బీఐ యంగ్ స్కాలర్స్ అవార్డ్ స్కీం,
ప్రాజెక్ట్ నెం. 8709, పోస్ట్ బాక్స్ నెం. 7632,
మలాడ్, ముంబై- 400 064.
మరిన్ని వివరాలకు .. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఆర్బీఐడాట్ఓఆర్జీడాట్ఇన్/యంగ్స్కాలర్స్' అనే వెబ్సైట్లో చూడవచ్చు.