Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా.. పరీక్షలకు 15 రోజులకు ముందే..?

యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా.. పరీక్షలకు 15 రోజులకు ముందే..?
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (20:04 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్‌) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్‌(నెట్‌) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారికంగా ప్రకటించింది. 
 
వాస్తవానికి ఈ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్‌లోనే జరగాలి. కానీ గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజ్ అయింది. మే 2 నుంచి మే 17 వరకు జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించినది. 
 
మరోవైపు ఈ ఏడాది జూన్ సెషన్ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2020 డిసెంబర్ సెషన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ జూన్‌లో జరిగే అవకాశముంది. దీంతో 2021 జూన్ సెషన్ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
 
అయితే మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్న సంగతి ఎన్‌టీఏ వెల్లడించలేదు. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలపై సమాచారం ఇస్తామని ప్రకటించింది. కాగా, ప్రస్తుత కొవిడ్ ఉధృతి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకునే యూజీసీ నెట్ డిసెంబర్ 2020 షెడ్యూల్‌ను (మే 2021)ను వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీ త్వరలో కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష