Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఫిబ్రవరి 11లోపు..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఫిబ్రవరి 11లోపు..?
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:57 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. గత నెలలో 35 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గడువు దగ్గరకు వచ్చేసింది. ఎస్‌బీఐలో ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గత నెలలోనే ప్రారంభమైంది. ఫిబ్రవరి 11 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 
 
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 2018 నవంబర్ 30 నాటికి 50 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్‌, ఐటీలో ఎంఎస్సీ, ఎంటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ఐటీ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలని ఎస్‌బీఐ తెలిపింది. 
 
ఇకపోతే.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్(క్రెడిట్ రివ్యూ) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ముంబై/నవీ ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఎంపిక చేయనుంది ఆర్‌బీఐ. ఇక వీటితో పాటు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులనూ భర్తీ చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికపై పూజారి అత్యాచారం.. పదేళ్ల పాటు జైలు శిక్ష