Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 February 2025
webdunia

నిత్యావసర సరకులు డెలివరీకి జొమాటో స్వస్తి

Advertiesment
నిత్యావసర సరకులు డెలివరీకి జొమాటో స్వస్తి
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:29 IST)
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ డెలివరీ కాలం సాగుతోంది. ఏది కావాలన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికి వచ్చేస్తుంది. కాగా ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ జోమాటో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. 
 
క‌రోనా నుంచి కోలుకుంటుండ‌టంతో ఫుడ్ డెలివ‌రీకి డిమాండ్ పెరుగుతుంది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ కంటే, ఫుడ్ డెలివ‌రీకే వినియోగ‌దారులు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో నిత్య‌వ‌స‌ర సేవ‌ల డోర్ డెలివ‌రీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సేవలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గ‌తేడాది ఓసారి ఈ నిర్ణ‌యం తీసుకోగా, జులై నెల‌లో ఈ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఫుడ్ డెలివ‌రీకి డిమాంట్ పెరుగుతున్న నేప‌థ్యంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల సేవ‌ల‌నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.
 
తమకు ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడంతో అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రం ముప్పావుగంటలోపే నిత్యావసర సరుకులు అందిస్తామంటూ ఈ ఏడాది జులైలో మళ్లీ ప్రకటించింది. 
 
ఇప్పుడు మరోమారు ఆ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటో దాదాపు రూ.745 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పోరేటర్‌ హత్యకు కుట్ర