Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశవ్యాప్తంగా మూతపడుతున్న ఏటీఎంలు...

దేశవ్యాప్తంగా మూతపడుతున్న ఏటీఎంలు...
, శనివారం, 8 జూన్ 2019 (14:34 IST)
దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి. గడిచిన రెండేళ్ళకాలంలో ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. 
 
ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. 
 
గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది. నిజానికి బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపుడు తప్పు చేశాం.. ఇపుడు శిక్ష అనుభవించాం.. పవన్ కళ్యాణ్