Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను వేడుక చేసేందుకు లిమిటెడ్‌ ఎడిషన్‌ మానిటర్లను విడుదల చేసిన వ్యూసోనిక్‌ ఇండియా

Advertiesment
sonic
, గురువారం, 8 డిశెంబరు 2022 (21:50 IST)
విజువల్‌ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన వ్యూ సోనిక్‌ నేడు లిమిటెడ్‌ ఎడిషన్‌ మానిటర్లను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ను వేడుక చేయడంలో భాగంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా  నాలుగు నూతన  వర్క్‌ మరియు బిజినెస్‌ మానిటర్‌ వేరియంట్లను ఫుల్‌ హెచ్‌డీ లో 22 అంగుళాలు, 24 అంగుళాలు, 27 అంగుళాల వేరియంట్లలో  విడుదల చేసింది. ఈ మానిటర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతలను కలిగి ఉంటాయి.
 
ఈ మోడల్స్‌లో  VA1903H-2-IN1 (19"), VA2215-H-IN1 (22"), VA2432-MH-IN1 (24"), VA2732-MH-IN1 (27")లు అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లను విస్తృత శ్రేణి వీక్షణ యాంగిల్స్‌, ఐ కేర్‌ టెక్నాలజీ కలిగి ఉంటాయి. ఇవి వినియోగదారులకు సాంకేతికత, సౌకర్యం అందిస్తాయి. అంతేకాదు, ఈ మానిటర్లు వినియోగదారుల కళ్లకు హాని కలిగించని రీతిలో ఐ కేర్‌ టెక్నాలజీ సైతం కలిగి ఉంటాయి.
 
ఈ స్పెషల్‌ ఎడిషన్‌ మానిటర్లను విడుదల చేయడం గురించి వ్యూసోనిక్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌- ఐటీ బిజినెస్‌, సంజోయ్‌ భట్టాచార్య మాట్లాడుతూ ‘‘ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మానిటర్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ ఆవిష్కరణతో డిజిటల్‌ సాధికారిత కలిగిన దేశంగా ఇండియాను మలచాలనుకుంటున్నాము. ఈ విభాగంలోని ప్రతి మానిటర్‌ అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంటుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కున్న కాలేజీ అమ్మాయి