Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.9,900 కోట్లు ... ఖాతాపై ఎన్.పి.ఏ నిషేధం

Cash

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (11:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోహీ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.9900 కోట్లు వచ్చిపడ్డాయి. అకస్మాత్తుగా తన ఖాతాలో భారీ మొత్తం కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఈ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. 
 
ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
 
సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఖాతాలోకి అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశకు మేము వివరించాం. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాం. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాం' అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు.
 
'ఎన్పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాం. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్ కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం" అని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ