Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై 24 గంటలు, 365 రోజులు నెఫ్ట్.. ఆర్బీఐ శుభవార్త

Advertiesment
ఇకపై 24 గంటలు, 365 రోజులు నెఫ్ట్.. ఆర్బీఐ శుభవార్త
, సోమవారం, 16 డిశెంబరు 2019 (14:34 IST)
దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలు, నగదు బదిలీలో క్రమంగా పెరిగాయి. గతంలో బ్యాంకులకు వెళ్లి డబ్బులు వేసే వాళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీలు ఎక్కువగా చేస్తున్నారు.

ఇక బ్యాంకులు కూడా వాటికి భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఎక్కువగా బ్యాంకింగ్ వినియోగదారులు వాటిపై మొగ్గు చూపిస్తున్నారు.
  
ఈ నేపథ్యంలో వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు ఏ సమయంలో అయినా సరే బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. 
 
ఇకపై సోమవారం నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ, 365 రోజులూ నిరంతరాయంగా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ నుంచి నగదు బదిలి అవకాశం ఉండేది.
 
దీనితో వినియోగదారులు ఎక్కువగా గూగుల్, ఫోన్ పే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు… సమయపరిమితి విధానంకి గుడ్ బై చెప్పింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో సైతం ఇక నెఫ్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు.. మగ పోలీసులు విటులుగా వెళ్తే..?