Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగుతున్న పసిడి - నిలకడగా వెండి ధరలు

పెరుగుతున్న పసిడి - నిలకడగా వెండి ధరలు
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:23 IST)
దేశంలో బంగారం వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించగా, వెండి ధరలు మాత్రం నికడగా ఉన్నాయి. సోమవారం మార్కెట్ ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలు ఇలా వున్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.
 
ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710 ఉంది.
 
అలాగే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,560 ఉంది.
 
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.69,600 ఉండగా, కోల్‌కతాలో రూ.65,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, కేరళలో రూ.69,600 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,600 ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఠాణాల‌లో పెరిగిపోతున్న దొంగ‌త‌నాలు; రూ.7 ల‌క్ష‌లు మాయం!