Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలాక్సీ ఎఫ్15 5జిని ఆవిష్కరించిన శాంసంగ్

Galaxy F15 5G

ఐవీఆర్

, సోమవారం, 4 మార్చి 2024 (22:15 IST)
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, గెలాక్సీ ఎఫ్15 5జిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇది వినియోగదారులకు దాని ముందు తరపు ఫోన్స్‌తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండటంతో పాటుగా తమ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితమైన అనేక ఫీచర్లతో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్15 5జి తమ విభాగంలో అత్యుత్తమమైన 6000mAh బ్యాటరీ, ఇతర ఫీచర్స్‌లో ఈ సెగ్మెంట్లో మాత్రమే కనిపించే sAMOLED డిస్‌ప్లే, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో తాజా ఫీచర్లు, మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది.
 
“మా మొదటి 2024 గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌, గెలాక్సీ ఎఫ్15 5జితో, శక్తివంతమైన పరికరాల ద్వారా మా కస్టమర్‌ల జీవితాలను శక్తివంతం చేస్తామనే మా నిబద్ధతను మేము నొక్కిచెబుతున్నాము. గెలాక్సీ ఎఫ్15 5జి ఆవిష్కరణ, అర్థవంతమైన ఆవిష్కరణల పట్ల మా అచంచలమైన అంకితభావాన్ని వెల్లడిస్తుంది, వినియోగదారులు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది.” అని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్  బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ అన్నారు.
 
“sAMOLED డిస్‌ప్లేతో సహా ఈ సెగ్మెంట్లో మాత్రమే కనిపించే బహుళ ఫీచర్‌లతో, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఈ విభాగంలో అత్యుత్తమమైన 6000mAh బ్యాటరీ గురించి మా వాగ్దానంతో, మేము గెలాక్సీ ఎఫ్15 5జితో ఆహ్లాదకరమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తున్నాము, ముఖ్యంగా వేగవంతమైన జీవితాన్ని గడిపే తరం, జెన్ జెడ్ కోసం అందిస్తున్నాము” అని అన్నారాయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్‌లోకి కొత్త శ్రేణిలో బ్లూస్టార్ రూం ఎయిర్ కండీషనర్లు