Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ
, సోమవారం, 15 మే 2017 (11:42 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. వాన్నా క్రై రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసి, కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. 
 
మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దృశ్యం సీన్ రిపీట్.. కట్టుకున్న భార్యను కడతేర్చి.. అపార్ట్‌మెంట్లోనే పాతిపెట్టిన భర్త..