Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెలకు రూ.1500 పెట్టుబడి.. మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షలు

నెలకు రూ.1500 పెట్టుబడి.. మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షలు
, గురువారం, 20 జనవరి 2022 (15:50 IST)
భారత తపాలా శాఖలో వివిధ రకాలై పొదుపు పథకాలను అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో గ్రామ్ సురక్షా యోజనా పథకం ఒకటి. ఈ పొదుపు పథకం కింద నెలకు రూ.1,500 చొప్పున పెట్టుబడిపెట్టినట్టయితే, ఆ పథకం మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షల మేరకు రిటర్న్స్ పొందవచ్చు. 
 
ఈ పథకం గురించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఈ పథకంలో చేరాలంటే చందాదారుని వయసు 19 యేళ్లు అంతకంటే ఎక్కువగా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 35 యేళ్ళు. ఈ పథకం కనీస విలువ రూ.10 వేల హామీని అందజేస్తుండగా, పెట్టుబడిపెట్టేవారు రూ.10 లక్షల వరకు తమ ఆర్థిక స్థోమతను బట్టి పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా పెట్టుబడి పెట్టిన వారి వయసు 80 యేళ్లు దాటిన తర్వాత వారి చట్టపరమైన లేదా నామినీకి బోనస్‌తో కూడిన మొత్తం చెల్లిస్తారు. 
 
ఇందులో పెట్టుబడిపెట్టేవారు తమ ప్రీమియం మొత్తాన్ని మూడు, ఆరు, సంవత్సరం ఇలా మూడు ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి ఖాతాదారుడుకి కనీసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో చెల్లించకపోతే చందాదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పాలసీని తిరిగి పునరుద్ధరించుకునే వెసులుబాటు వుంది. 
 
ఉదాహరణకు ఒక యువకుడు 19 యేళ్ల వయసులో ఈ పథకం కింద చేరి రూ.10 లక్షల పెట్టుబడిపెడితే నెలవారీ ప్రీమియంగా 55 యేళ్లకు నెలవారీ ప్రీమియం రూ.1515 చొప్పున చెల్లించాల్సి వుంటుంది. అతనికి 55 యేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.31.60 లక్షలుగా చెల్లిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భ‌ర్త త‌ల నరికి... ర‌క్తం ఓడుతున్న త‌ల ప‌ట్టుకుని వీధుల్లో తిరిగిన భార్య‌!