Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిఎల్ క్యాపిటల్ నిర్వహించిన రింగ్‌సైడ్ వ్యూ కార్యక్రమం భారతదేశ-యుకె FTA చర్చలు

Advertiesment
PL capital Expectations

ఐవీఆర్

, సోమవారం, 16 జూన్ 2025 (19:34 IST)
PL క్యాపిటల్ ప్రభుదాస్ లిల్లాదర్, భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటి, ఇటీవలి ఇండియా-యుకె ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)కి సంబంధించిన వ్యూహాత్మక, ఆర్థిక అంశాలపై లోతైన విశ్లేషణను అందించేందుకు ప్రత్యేకమైన ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చను నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆతిథ్యమిచ్చిన PL క్యాపిటల్ చైర్‌పర్సన్ మరియు ఎండీ అమిషా వోరా, యుకె ట్రేడ్ కమిషనర్ హర్జిందర్ కాంగ్‌ను ఫోరమ్‌లో ఆహ్వానించి ప్రారంభించగా, కో-ప్యానలిస్టులు మనీష్ సింగ్ (సీఐఓ, క్రాస్‌ బ్రిడ్జ్ క్యాపిటల్), అనుజ్ అగర్వాల్ (గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, వెల్‌స్పన్ గ్రూప్) కూడా పాల్గొన్నారు.
 
FTA భారతదేశం యొక్క వాణిజ్య వ్యూహాన్ని 'టారిఫ్-ఫస్ట్' నుండి 'ట్రస్ట్-ఫస్ట్' మోడల్ వైపు మళ్లిస్తోందని, ఇది సేవలు, తయారీ, మూలధన ప్రవాహాల్లో $120 బిలియన్ల వరకు అవకాశాలను అన్లాక్ చేయగలదని" శ్రీమతి అమిషా వోరా, చైర్‌పర్సన్ & ఎండి, PL క్యాపిటల్ తన ప్రారంభ వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న రంగాల పరంగా, యూకేకు భారతదేశం ఎగుమతుల్లో 72% వరకూ వాణిజ్య మిగులు ఉన్నట్లు ఆమె వివరించారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఇంధనాలు, రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు వంటి సెక్టార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ వస్తువులు, గార్మెంట్ రంగాలకు ఈ ఒప్పందం అభివృద్ధికి ఊతమిస్తున్నదని స్పష్టం చేశారు.
 
FTA సేవల కోణాన్ని హైలైట్ చేస్తూ, యూఎస్ తరువాత భారతదేశం యూకేకు రెండవ అతిపెద్ద సేవల ఎగుమతిదారుగా ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు. అంచనా ప్రకారం ఈ విలువ $18 బిలియన్లను చేరుకుందని పేర్కొన్నారు. భారత ఐటి, క్రియేటివ్ మరియు ప్రొఫెషనల్ టాలెంట్‌ను సాఫ్ట్ పవర్‌గా మార్చే దిశగా ఇది ప్రభావవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. స్థూల దృష్టితో చూస్తే, ఈ ఒప్పందాన్ని ఆమె రెండు నిర్ణయాత్మక మార్పుల ప్రతిబింబంగా పేర్కొన్నారు. బ్రెక్సిట్ తరువాత బ్రిటన్ తీసుకున్న వ్యూహాత్మక వైవిధ్యం, చైనా ఆధారిత సరఫరా శృంఖల నుండి ప్రజాస్వామ్య భద్రతా పార్ట్‌నర్ల వైపు దృష్టి మళ్లించడం; అలాగే నియంత్రణ స్వాధీనతను వదలకుండా, నియమాల ఆధారిత సామరస్య ఆర్థిక వ్యవస్థలతో గాఢ సంబంధాల్ని బలపరచే వ్యూహాన్ని ప్రతిబింబిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
 
“ఈ ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇది యుకె-ఇండియా ఆర్థిక సహకారం యొక్క తదుపరి అధ్యాయానికి బ్లూప్రింట్” అని మిస్టర్ హర్జిందర్ కాంగ్, యూకే ట్రేడ్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య £43 బిలియన్ వాణిజ్యం కొనసాగుతున్నప్పటికీ, ఈ ఒప్పందం ద్వారా అదనంగా £25.5 బిలియన్ విలువ చేసే అవకాశాలు తలుపు తడుతున్నాయని పేర్కొన్నారు. ఇది తయారీదారులు, సేవల సంస్థలకు అసలైన లాభాలను తెస్తుందన్నారు. తదుపరి దశలుగా చట్టపరమైన స్క్రబ్బింగ్, ప్రధాన మంత్రి సంతకం, పార్లమెంటరీ ఆమోదం (9-12 నెలల్లో పూర్తి అయ్యే అంచనా), అమలు ప్రక్రియలతో పాటు వాణిజ్య సదుపాయాల్లో సేవల సరళీకరణ, ఆటో టారిఫ్లు (కోటాల పద్ధతిలో), భవిష్యత్తులో సిద్ధంగా ఉండే టెక్-సెక్యూరిటీ కారిడార్ లాంటి అంశాలు ఇప్పటికే ఒప్పందంలో పొందుపరచబడ్డాయని వివరించారు. ఫార్మా, సెమీకండక్టర్లు, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారం మరింత విస్తరించే అవకాశముందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 
99% భారతీయ ఉత్పత్తులు యూకేకు మరియు 90% యూకే ఉత్పత్తులు భారతదేశానికి ఇకపై సుంక రహితంగా మారనున్నాయి.
విస్కీపై UK గరిష్ట సుంకం 10 సంవత్సరాలలో 150% నుండి 40% కి తగ్గుతుంది.
 
కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగం (CBAM) భారతదేశం-యుకె ఎఫ్టిఎలో భాగం కాకపోవడం, ఈ ఒప్పందం ద్వారా కార్బన్ పన్నులు ద్వైపాక్షిక వాణిజ్య నిబంధనలను ప్రభావితం చేయవని భారతీయ పరిశ్రమకు స్పష్టమైన భరోసాను కల్పిస్తుంది.
 
సేవలలో గణనీయమైన సరళీకరణ: కాంట్రాక్ట్ సర్వీస్ ప్రొవైడర్ల కింద 36 రంగాలు, అలాగే స్వతంత్ర నిపుణుల కేటగిరీలో ఐటీ, ఆర్‌అండ్‌డి, చెఫ్లు, యోగా బోధకులు, సంగీతకారులు తదితరంగా 16 రంగాలకు ఈ ఒప్పందం ప్రాప్యతను అందిస్తోంది.
 
FTAతో పాటు, యుకె మరియు భారతదేశం పరస్పర DCC గురించి చర్చించేందుకు అంగీకరించాయి. అంటే, ఒక దేశానికి చెందిన ఉద్యోగులు మరో దేశంలో తాత్కాలికంగా (మూడు సంవత్సరాల వరకు) పని చేస్తూ ఉండగా, వారు తమ స్వదేశంలోనే సామాజిక భద్రతా విరాళాలు చెల్లించడం కొనసాగించవచ్చు. ఇది ముఖ్యంగా తయారీ రంగానికి లాభదాయకమవుతుంది, ఇది భారత GDPలో 2.3%, పారిశ్రామిక ఉత్పత్తిలో 12-13% వాటా కలిగి ఉండి, 45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయినప్పటికీ, బ్రిటన్‌కు మన ఎగుమతులు కేవలం 1.5 బిలియన్ డాలర్లకే పరిమితమవుతున్నాయి, ఇది బంగ్లాదేశ్, వియత్నాం కంటే తక్కువ. ఈ FTAతో భారత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు న్యాయమైన అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, టారిఫ్ తగ్గింపుల అమలులో ఆలస్యం వస్తే, పెట్టుబడుల ఉత్సాహంపై దుష్ప్రభావం చూపవచ్చని, “తగ్గింపులు చాలాకాలం పొడిగిస్తే, పరిశ్రమ ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉంది,” ఆయన హెచ్చరించారు.
 
మనీష్ సింగ్ సేవలు మరియు మూలధన ప్రాప్యత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు, "ప్రపంచం సేవల ఆధారంగా నడుస్తోంది. సేవల సంబంధిత వాణిజ్య ఒప్పందం చాలా కీలకం. లండన్‌లో ఉన్న 1.2 ట్రిలియన్ పౌండ్ల విలువైన నిర్వచిత ప్రయోజన పెన్షన్ ప్రణాళికలు ప్రధానంగా బాండ్లలో పెట్టుబడి పెట్టినవే. వాటిలో కేవలం 4-5% పునర్వ్యవస్థీకరణ కూడా భారతదేశానికి తీవ్రమైన మూలధన ప్రవాహాన్ని తెరవగలదు."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్