Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో 25 రోజులుగా నిలకడగా చమురు ధరలు...

దేశంలో 25 రోజులుగా నిలకడగా చమురు ధరలు...
, సోమవారం, 29 నవంబరు 2021 (12:34 IST)
దేశంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. ముఖ్యంగా, ఇటీవల దేశ వ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ధరల ప్రకారం కూడా ఈ చమురు ధరల్లో తేడా కనిపించలేదు. అంటే.. గత 25 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.103.97గాను, డీజిల్ ధర రూ.86.67గాను ఉంది. అలాగే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14 చొప్పున ఉంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.108.20గా ఉంటే డీజిల్ ధర రూ.94.62గా వుంది. విజయవాడ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.110.50గా ఉంటే డీజిల్ ధర రూ.96.46గా ఉంది. కాగా, వచ్చేయేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, పెట్రోల్ ధరలను వీలైనంత మేరకు స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి!