Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు
, ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:40 IST)
దేశంలో ఇంధన ధరలకు ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. శనివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.102.14కు చేరుకోగా ముంబైలో 108.19కి ఎగబాకింది. అలాగే లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.90.47కి పెరుగగా ముంబైలో రూ.98.16కి చేరుకుంది. కేవలం వారం వ్యవధిలో నాలుగుసార్లు పెట్రోల్‌ ధరలు పెరుగగా.. తొమ్మిది రోజుల్లో ఏడుసార్లు డీజిల్‌ ధరలు పెరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఐఐటీ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష