Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉల్లి ఘాటు.. వందకే ఐదు కేజీలు వచ్చేవి.. కానీ ఇప్పుడు..?

ఉల్లి ఘాటు.. వందకే ఐదు కేజీలు వచ్చేవి.. కానీ ఇప్పుడు..?
, బుధవారం, 21 అక్టోబరు 2020 (15:00 IST)
ఉల్లిపాయల రేటు పెరిగిపోయాయి. నెల క్రితం వంద రూపాయలకే ఐదు కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ సీన్ మారింది. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటేనే వంద పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేజీ ఉల్లిగడ్డలు కొనాలంటే రూ.50-80 వరకు చెల్లించాలి. అంటే నెల రోజుల వ్యవధిలోనే ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. 
 
ఉల్లి గడ్డల ధర ఇంకా భారీగా పెరిగే అవకాశముందని వ్యాపారులు షాకిస్తున్నారు. పండుగ నాటికి ఉల్లి ధర కొండెక్కి కూర్చొనుందని వారు చెప్తున్నారు. ఉల్లి ధరలు ఇలానే పెరుగుతూ వెళ్తే దీపావళి పండుగ నాటికి కేజీ ఉల్లి గడ్డల ధర రూ.100కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఉల్లి గడ్డల ధర భారీ స్థాయిలో పెరగొచ్చనే అంచనాలకు ఒక ప్రధాన కారణం ఉంది. 
 
అకాల వర్షాల కారణంగా ఉల్లి గడ్డల ధర భారీగా పెరగనుంది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింటోంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి గడ్డల మార్కెట్ లాసాల్‌గాన్ (నాసిక్ దగ్గరిలో)లో ఇప్పుడు ఉల్లి ధర క్వింటాల్‌కు దాదాపు రూ.7,000 సమీపంలో ఉంది. ట్రేడర్లు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఉల్లి గడ్డల ధర కేజీకి ఏకంగా రూ.100కు చేరే ఛాన్స్ ఉందనంటున్నారు. 
 
మహరాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడే ఉల్లి పంట దెబ్బతింది. కేవలం మహరాష్ట్రలో మాత్రమే కాకుండా కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లి గడ్డల ధర పెరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఆ పని చేశాడు.. నాన్న స్నేహితుడే..?