Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..

మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..
, బుధవారం, 9 ఆగస్టు 2017 (10:44 IST)
మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.30-35 పలుకుతున్నాయి.

తెలంగాణ, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి కాకపోవడంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్లోనే కిలో రూ.30  పలుకుతోంది. పబ్లిక్ మార్కెట్లలో రూ.36వరకు కిలో ఉల్లిని వ్యాపారులు అమ్ముతున్నారు. 
 
ఉల్లి పండించే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి కూడా రోజుకు రెండుమూడు లారీలకు మించి లోడ్స్ రాకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వచ్చే నెల నుండి మండీలకు ఉల్లి లోడ్లు పెరుగుతాయని.. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లిధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అగ్రికల్చర్ సెక్రటరీ శోభన పట్నాయక్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీడేస్ సీన్ రిపీట్.. ప్రేయసి మోసం... వేరే వ్యక్తితో మజా... ప్రేమికుడు ఏడ్చాడు.. కానీ..?