Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్ ‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

OnePlus Nord CE 3 Lite
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:00 IST)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్‌ ఫోను అందుబాటులోకి తెచ్చింది. 5జీ మోడల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరాగా, ఒక మోడల్ ధర రూ.19,999గాను, రెండో మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు రంగుల్లో లభ్యంకానుంది. ఇందులో లైమ్ కలర్ చూడముచ్చటగా ఉంది. చాలా తక్కువ బరుతో ఒక చేత్తోనే ఫోనును వినియోగించేలా ఉంది. 
 
ఇకపోతే, బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్ కొత్త వన్ ప్లస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. సింగిల్ చార్జితో రోజంతా వస్తుంది. పూర్తి చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 1టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. కెమెరా పనితీరు, క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేగంపేటలో ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు