Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు

Pets
, శనివారం, 6 మే 2023 (10:33 IST)
Pets
జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్. పెంపుడు జంతువులు కూడా ఇకపై రైలులో ప్రయాణించవచ్చు. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 
 
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. 
 
ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌‌లో కూడా పెంపుడు జంతువులను తరలించే వీలుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి.. ఏపీలో వర్షాలు, పిడుగులు