Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై ఒకటో తేదీ నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని లేదు..

జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును

జూలై ఒకటో తేదీ నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని లేదు..
, మంగళవారం, 20 జూన్ 2017 (10:04 IST)
జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర  మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును విధిగా నింపాల్సి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపార్చర్ కార్డులో ప్రయాణికుడి పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నంబరు, భారత్‌లోని చిరునామా, విమాన నెంబరు, ప్రయాణిస్తున్న తేదీ తదితర వివరాలను నింపాల్సి ఉండేది. 
 
అయితే జూలై 1 నుంచి ఈ విధానాన్ని తొలగిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ విధానాన్ని ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండింగ్‌ మై లైఫ్.. ఐ యామ్ నాట్ హ్యాపీ... భర్తకు భార్య చివరి సందేశం