Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంట గ్యాస్ బాదుడు : రాయితీ సిలిండరుపై రూ.50 పెంపు - ఇకపై ప్రతి 15 రోజులకోసారి...

వంట గ్యాస్ బాదుడు : రాయితీ సిలిండరుపై రూ.50 పెంపు - ఇకపై  ప్రతి 15 రోజులకోసారి...
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:08 IST)
వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.100కు చేరువగా వెళ్తున్న వేళ.. సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు పెంచాయి. 
 
దేశంలో పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరుపై మరో రూ.50 పెంచాయి. ఈ బాదుడుతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండరు ధర రూ.769కి చేరింది. ఈ పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయట.
 
దేశంలో అసలే పెట్రోలు ధరలు పెరుగుదలతో సామాన్యుడి జేబు చినిగిపోతోంది. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది. 

అంతేకాకుండా, ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ : సంచలన నిర్ణయం తీసుకున్న గంటా!