Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త సెల్టోస్‌ను జులై 4న ఆరంభించనున్న కియా ఇండియా

Seltos
, సోమవారం, 3 జులై 2023 (23:49 IST)
జులై 4న కొత్త సెల్టోస్ విడుదల చేస్తున్నామని కియా ఇండియా, భారతదేశపు ప్రీమియం మరియు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారు, ప్రకటించింది. కొత్త అవతారంలోని సెల్టోస్, తాజా డిజైన్, శ్రేణిలోనే మెరుగైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. తమ శ్రేణిలోని ప్రముఖ ఫీచర్స్, డిజైన్ నాయకత్వంతో ఆటోమొబైల్ పరిశ్రమలోనే సెల్టోస్ బ్రాండ్ కొత్త విప్లవాన్ని ఆరంభించింది. కొత్త సెల్టోస్ శ్రేణిని మరోసారి పునః కనుగొనడానికి సిద్ధంగా ఉంది. కియా 30 జూన్ 2023న కొత్త సెల్టోస్ టీజర్‌ను కూడా విడుదల చేసింది.
 
ఆగస్ట్ 2019లో కియా సెల్టోస్ ఆవిష్కరణతో భారతదేశపు మార్కెట్ లోకి అడుగు పెట్టింది. భారతదేశపు ఆధునిక వినియోగదారుల హృదయాలను చూరగొంది. అతి తక్కువ సమయంలో కేవలం 46 నెలల్లో, సెల్టోస్ 5 లక్షల మైలురాయి సేల్స్‌ను దాటిన అతి వేగవంతమైన ఎస్ యూవీగా మారింది. ప్రస్తుతం, 3.78 లక్షల సెల్టోస్ భారతదేశపు రహదారులు పై ప్రయాణిస్తున్నాయి, ఇది మొత్తం దేశీయ పరిమాణంలో 53% గా ఉంది. కంపెనీ  అంతర్జాతీయంగా దాదాపు 1.39 లక్షల సెల్టోస్ ను సుమారు 90+ మార్కెట్స్ కు కూడా ఎగుమతి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు.. 7న ప్రారంభం