Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 నిమిషాల్లో చార్జింగ్ పూర్తయ్యే ఇన్ఫినిక్స్ మొబైల్స్ విక్రయాలు ప్రారంభం

zero ultra
, ఆదివారం, 25 డిశెంబరు 2022 (15:23 IST)
దేశంలో మరో కొత్త రకం మొబైల్ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఇది కేవలం 12 నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తవుతుంది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ.29,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.3 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్‌లో అందుబాటులో ఉంచింది. 
 
6.8 అంగుళాల ఫుల్‌ హెచ్.డి, 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లు కలిగివున్నాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, మీడియా టెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ సెట్‌తో తయారు చేశారు. 12జీబీ ర్యాబ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. 
 
ఈ ఫోన్ వెనుక 200 మెగాపిక్సల్ కెమరాను అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోనులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 180 వాట్ ఫాస్ట చార్జ్‌తో కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోను ధర రూ.29999గా ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుపై రూ.2 వేలు, ఫెడర్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.3 వేలు చొప్పున తగ్గింపు పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఆర్డీవో నోటిఫికేషన్ విడుదల