Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడగింపు

Advertiesment
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడగింపు
, మంగళవారం, 11 జనవరి 2022 (19:45 IST)
దేశంలోని ఆదాయపన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. తాజాగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు తేదీని మరోమారు పొడగించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకు ఉన్న గడువును మార్చి నెల 15వ తేదీ వరకు పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 మార్చి 15వ తేదీ వరకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయొచ్చు. నిజానికి ఈ గడువు గత యేడాది డిసెంబరు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఇపుడు దేశంలో నెలకొన్న కరోనా థర్డ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును మరోమారు పొడగించినట్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్య భక్తులను తిరుమలేశుని పాదాల చెంతకు చేర్చే కొత్త పథకం?!! ఏంటది?