Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ పన్నుల వసూళ్లు

Advertiesment
gst collections
, గురువారం, 1 జూన్ 2023 (17:25 IST)
గత నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ పన్నులు భారీగా వసూలవుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో మే నెలలో ఏకంగా రూ.1,57,090 కోట్లుగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత యేడాది మే నెలతో పోలిస్తే ఇపుడు ఏకంగా 12 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. గత యేడాది రూ.1,40,885 కోట్లుగా ఉంది. 
 
మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ కింద రూ.35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే.
 
అదేసమయంలో జీఎస్టీ వసూళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో రూ.3373 కోట్లు వచ్చాయి. 11 శాతం  వృద్ధి నమోదైంది. తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ విషయంలో ఎప్పటిలానే 16 శాతం వృద్ధితో మహారాష్ట్ర 23,536 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు.. రెండు నెలల్లో రెండో ఘటన