Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే బంగారం ధరలు పెరిగాయి

అందుకే బంగారం ధరలు పెరిగాయి
, గురువారం, 14 మే 2020 (17:47 IST)
అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ నిశ్చయమైన కష్టాలకు దారితీసింది. అధిక నిరుద్యోగ రేటుతో నిండి ఉంది. కరోనా వైరస్ యొక్క రెండవ మరియు గణనీయమైన దశలపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఎందుకంటే దేశాలు లాక్ డౌన్ తొలగించి సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి.
 
బంగారం
బుధవారం రోజున, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే ఎక్కువగా పొడిగించిన రికవరీ వ్యవధిని ఊహించి కొత్త ఉద్దీపన ప్రణాళికలను ప్రకటించిన తరువాత ఈ స్పాట్ బంగారం 0.77 శాతం పెరిగి ఔన్సుకు 1715.3 డాలర్లకు చేరుకున్నాయి.
 
అమెరికాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, మరియు ఈ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి ఎఫ్.ఇ.డి సాధనాల సూత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే కొన్ని నెలలకు, వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయని, పసుపు లోహ ధరలకు మరింత మద్దతు అందవచ్చని భావిస్తున్నారు. మహమ్మారి యొక్క ఊహించిన రెండవ దశ, అనేక దేశాలు అందించిన సమగ్ర ఆర్థిక ప్యాకేజీలకు అదనంగా, బంగారం ధరను పెంచింది.
 
వెండి
బుధవారం రోజున, స్పాట్ సిల్వర్ ధరలు 1.49 శాతం పెరిగి ఔన్సుకు 15.6 డాలర్లకు చేరుకోగా, ఎంసిఎక్స్ ధరలు 0.21 శాతం తగ్గి కిలోకు రూ. 42965 లుగా చేరుకున్నాయి.
 
ముడి చమురు
బుధవారం రోజున, డబ్ల్యుటిఐ ముడిచమురు ధర 1.90 శాతం తగ్గి బ్యారెల్‌కు 25.3 డాలర్లకు చేరుకుంది. యుఎస్  చమురు ఇన్వెంటరీ స్థాయిలు, ఆశించబడిన 4.1 మిలియన్ బ్యారెల్స్ పెరుగుదలతో పోలిస్తే, ఇంకా 475,000 బారెల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ అభివృద్ధి జరిగింది.
 
డిమాండ్ తగ్గడం మరియు అధిక సరఫరా సమస్యను పరిష్కరించడానికి ప్రధాన ఉత్పత్తిదారులు ప్రకటించిన కొన్ని ఉత్పత్తి తగ్గింపుల కారణంగా ముడి చమురు ధరలకు ఈ నెల ప్రారంభంలో మద్దతు లభించింది. సౌదీ అరేబియా మరియు పెట్రోలియం ఎగుమతి సంస్థల సంస్థ రాబోయే నెలల్లో తమ ఉత్పత్తిని తగ్గించగల చర్యలను అమలు చేశాయి.
 
అయినా, శీతాకాలంలో కరోనావైరస్ తిరిగి దాడి చేస్తుందనే ఆందోళన మరియు అధిక లాభాలు అందించే విమానయాన పరిశ్రమపై పరిమితులు, ఇవన్నీ కూడా ముడి చమురు లాభాలను నియంత్రించాయి.
 
మూల లోహాలు
ఈ మహమ్మారి యొక్క పునరుత్థాన తరంగాలు చైనా మరియు దక్షిణ కొరియాకు వ్యాపించడంతో బుధవారం చాలా మూల లోహాల ధరలు తక్కువగా ఉన్నాయి. వైరస్ సంబంధిత లాక్ డౌన్లను త్వరగా తీసివేయడం అనేది ప్రపంచ జనాభాను తీవ్రంగా దెబ్బతీస్తుందనే వాస్తవాన్ని ఇది సూచించింది.
 
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పిబిఒసి) మరియు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు మరియు సహాయక ప్రణాళికలు ఒక ఆశాకిరణమయింది, ఇది మూల లోహ ధరలకు కొంత మద్దతు ఇచ్చింది.
 
రాగి
బుధవారం రోజున, అధిక సరఫరా యొక్క ఇంకా ఉన్న ఆందోళనల నడుమ లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎమ్ఇ) రాగి ధరలు 0.62 శాతం తగ్గాయి. పెరూ మరియు ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో గనులను తిరిగి తెరవడం, వేగంగా పరివర్తనం చెందుతూ, భయపెట్టే వైరస్, ఇవన్నీ కలిసి, మార్కెట్ మనోభావాలపై భారం మోపి, రెడ్ మెటల్ ధరలను తగ్గించాయి.
 
టీకా అభివృద్ధి మరియు ప్రపంచ జనాభాకు టీకాలు వేయడానికి భవిష్యత్తులో చాలా కాలం పట్టవచ్చు. ఇంతలో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ ప్రజలను తీవ్ర పేదరికం మరియు కష్టాల నుండి పైకి తీసుకుచచ్చే చర్యలకు మద్దతు ఇవ్వాలి మరియు ప్రపంచం మాంద్యంలోకి వెళ్ళకుండా ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించటానికి సహాయపడాలి.
 
- ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖర్చు తగ్గుతోందిగా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కంటిన్యూ చేస్తే పోలా?