Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold Prices: ఈ వారంలో రూ.లక్ష మార్కును దాటిన బంగారం ధరలు.. శుక్రవారం తగ్గి..?

Advertiesment
Gold Jewelry

సెల్వి

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (20:02 IST)
బంగారం కొనాలనుకునేవారికి గట్టి షాక్ తప్పలేదు. ఇండియా బులియన్, జ్యువెలర్స్ అసోసియేషన్ డేటా ప్రకారం, శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,669 వద్ద ఉంది. కోల్‌కతా స్పాట్ మార్కెట్‌లో, పశ్చిమ బెంగాల్ బులియన్ మర్చంట్స్, జ్యువెలర్స్ అసోసియేషన్ డేటా ప్రకారం బంగారం ధరలు శుక్రవారం రూ.700లు తగ్గి రూ.95,800కు చేరుకున్నాయి. గురువారం రూ.96,500గా ఉంది.
 
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా ధరలు తగ్గాయి. జూన్ కాంట్రాక్టుల కోసం, 10 గ్రాముల బంగారం ధర రూ.669 తగ్గి రూ.95,243 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బలహీనత, స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వల్ల ఈ తగ్గుదల సంభవించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. న్యూయార్క్ మార్కెట్లో, బంగారం ఫ్యూచర్స్ 1.15 శాతం తగ్గి ఔన్సుకు $3,310.98కి చేరుకున్నాయి. 
 
గత వారం ధరల ట్రెండ్‌ను పరిశీలిస్తే: 
బంగారం ఏప్రిల్ 21న రూ.96,587, 
ఏప్రిల్ 22న రూ.99,100, 
ఏప్రిల్ 23న రూ.95,784, 
ఏప్రిల్ 24న రూ.96,075, 
ఏప్రిల్ 25న రూ.95,699 వద్ద ట్రేడైంది. 
 
ముఖ్యంగా, మంగళవారం బంగారం రూ.1 లక్ష మార్కుకు చేరుకోవడంతో, పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, శుక్రవారం ముంబైలో వెండి ధర కిలోగ్రాముకు రూ.1,00,900 వద్ద స్థిరంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?