Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంట గ్యాస్ ధర తగ్గింపు .. ట్విస్ట్ పెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Advertiesment
lpg cylinder
, ఆదివారం, 22 మే 2022 (14:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పనిలోపనిగా వంట గ్యాస్ సిలిండరుపై రూ.200 మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఇక్కడో మెలిక పెట్టారు. 
 
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పొందిన గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. అంటే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఈ లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ధరలో రూ.200 తగ్గనుంది. 
 
ఈ తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.803కు దిగిరానుంది. ఈ 9 కోట్ల మంది లబ్ధితారుల గ్యాస్ సిలిండరుకు రూ.200 చొప్పున రాయితీని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ సబ్సీబీ 12 ఎల్పీజీ సిలిండర్ల వరకు ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ధర తగ్గింపుతో కేంద్ర ఖజానాపై రూ.6100 కోట్ల భారం పడుతుందని ఆమె గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు - ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు