Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు

ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకు

మోదీ దెబ్బ... బ్యాంకుల్లో జనం సొమ్ము రూ.5,00,000 కోట్లు జమ, ఐసీఐసీకి రూ. 32,000 కోట్లు
, సోమవారం, 21 నవంబరు 2016 (15:51 IST)
ఒకే ఒక్క ప్రకటనతో జనం సొమ్మంతా నేరుగా బ్యాంకుల్లో జమైపోతోంది. నల్లధనం ఉన్నవాళ్లు గుల్ల అవుతున్నారో ఏమోగానీ బ్యాంకులకు మాత్రం డబ్బులు వచ్చిపడుతూనే ఉన్నాయి. నవంబరు 8న మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాక ఇప్పటివరకూ అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. 
 
తమ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 32 వేల కోట్లు జమ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎక్జిక్యూటివ్ చందా కొచ్చర్ వెల్లడించారు. ఇంకా డిపాజిట్ చేస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అన్నీ సమసిపోతాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీల మోజు మనోళ్లకే ఎక్కువ.. ఇక చెన్నై రైల్వేస్టేషన్‌లో సెల్ఫీలు తీసుకోరాదు..