Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజాన్ని అధికారం అంగీకరిస్తుందా? చిదంబరం ప్రశ్న

కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు.

నిజాన్ని అధికారం అంగీకరిస్తుందా? చిదంబరం ప్రశ్న
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (14:52 IST)
కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. అధికారంలో ఉన్నవారి గురించి ఆయన వాస్తవాలు వెల్లడించారు. మరి ఈ వాస్తవాలను అధికారం అంగీకరిస్తుందా? అని ఆయన వరుస ట్వీట్లతో ప్రశ్నించారు.  
 
ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్లలో.. ‘ఆయన (యశ్వంత్‌) అధికారంలో ఉన్న వారి గురించి నిజం చెప్పారు. మరి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్న ఆ నిజాన్ని అధికారం ఒప్పుకుంటుందా? అంటూ బీజేపీకి చురకలంటించారు. సొంత నేత చేసిన విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. 
 
కాగా, యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ భారీ తప్పిదం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీడీపీ తగ్గడానికి కారణం సాంకేతిక కారణాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా ఖండించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ సర్కారు విధానాలతో దేశ అర్థిక వ్యవస్థ ధ్వంసం : బీజేపీ ఎంపీ