దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా రూ. ఒక్కటికే ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా పేరిట దీన్ని లాంఛ్ చేసింది. ఇందులో రూ.1కే అపరిమిత సేవలను అందించనుంది. అయితే, ఇక్కడో ట్విస్ట్ పెట్టింది. కేవలం ఒక్త వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీసంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా రిటైలర్ను సందర్శించవచ్చు.