Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవి ఆర్బీఐ రూ.100 నోట్లు కావు... చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటు.. తస్మాత్ జాగ్రత్త

నకిలీ కరెన్సీ ముఠా ఆగడాలు నానాటికీ అధికమై పోతున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ముద్రించినట్టుగానే కరెన్సీ నోట్లను ముద్రించి... చలామణిలోకి తెస్తున్నారు. తాజాగా చిల్డ్రస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో రూ.10

అవి ఆర్బీఐ రూ.100 నోట్లు కావు... చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటు.. తస్మాత్ జాగ్రత్త
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:10 IST)
నకిలీ కరెన్సీ ముఠా ఆగడాలు నానాటికీ అధికమై పోతున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ముద్రించినట్టుగానే కరెన్సీ నోట్లను ముద్రించి... చలామణిలోకి తెస్తున్నారు. తాజాగా చిల్డ్రస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ విడుదల చేసిన రూ.100 నోటు పూర్తిగా ఒరిజినల్‌ నోటులాగానే కనబడుతుంది. నోటుపై ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఉంది. అంత పెద్ద అక్షరాలతో కనబడుతున్నా దాన్ని తీరిగ్గా చూసే ఓపిక, సమయం చాలా మందికి ఉండదు. 
 
ముంబైకి చెందిన ఓ జూనియర్‌ నటీమణి మోసపోయింది. ముంబైకి చెందిన మేఘా చక్రవర్తి అనే నటి ఆటోలో ఇంటికి వచ్చి డ్రైవర్‌కు 500 రూపాయలు ఇచ్చింది. తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని డ్రైవర్‌ తిరిగి చిల్లర ఇచ్చేశాడు. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే ఈ వంద నోటు కనిపించింది. వెంటనే ఆమె సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని అప్‌డేట్‌ చేసి వందనోట్లు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి అని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రేయసి వక్షోజాల్ని కత్తెరతో కట్ చేసేశాడు.. గర్భస్థ శిశువు సేఫ్.. కానీ..?