Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏంటది?

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏంటది?
, సోమవారం, 18 జనవరి 2021 (13:37 IST)
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పింఛనుదారులు కూడా ఉన్నారు. 
 
ఏడో వేతన సంఘం సిఫార్సులతో పాటు.. ప్రస్తుతం ఉన్న 28 శాతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరవు భత్యం (డీఏ), డియర్‌నెస్ రిలీప్ (డీఆర్‌)లను పెంచేందుకు నిర్ణయించినట్టు సమాచారం. 
 
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు... డీఏను 17 నుంచి 21 శాతానికి అంటే 4 శాతం పెంచేందుకు నిర్ణయించింది. జనవరి నుంచి ఇది వర్తించే అవకాశం ఉంది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితిని వివరించి, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఇవ్వాలని కోరారు. 
 
కోవిడ్ సంక్షోభం కారణంగా 2021 జూలై వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏలో ఇంక్రిమెంట్ నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 2020న నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో బాబాయ్ కూడా ఉన్నారు : సంచయిత