Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుదీనా ముద్దను ముఖానికి రాసుకుంటే.. మొటిమలు మాయం..!

పుదీనా ముద్దను ముఖాని రాసుకుంటే.. ముఖం తేజస్సును సొంతం చేసుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే.. ముఖంలో మొటిమలుండవు. అలాగే చర్మంపై ముడతల్ని నివార

Advertiesment
pudina face packs
, బుధవారం, 27 జులై 2016 (10:11 IST)
పుదీనా ముద్దను ముఖాని రాసుకుంటే.. ముఖం తేజస్సును సొంతం చేసుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే.. ముఖంలో మొటిమలుండవు. అలాగే చర్మంపై ముడతల్ని నివారించేందుకు, శరీరఛాయను మెరుగుపరిచేందుకు పసుపును వాడాలి. 
 
రెండు చెంచాల పసుపులో చెంచా తేనె, కాసిని బాదం పాలు చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటారు. 15 నిమిషాల తర్వాత కడిగేస్తారు. ఇక బాగా నానబెట్టిన పెసల్ని మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటారు. అరగంటయ్యాక కడిగేసుకుంటారు. ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాదు. మొటిమలు కూడా తగ్గుతాయి.
 
అలాగే గ్రీన్ టీ చర్మ, కేశ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. పొద్దునే లేచి మూడు, నాలుగుకప్పులు తాగేస్తారు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. జీవక్రియల వేగాన్నీ పెంచుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీర బరువు తగ్గాలంటే బాదం, తేనె, దాల్చిన చెక్క మిశ్రమం భేష్!