ఓట్మీల్, క్యాబేజీతో క్యాల్షియం ఎక్కువగా పొందండి
, గురువారం, 22 డిశెంబరు 2011 (15:37 IST)
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య ఆస్టియోపోరోసిస్. ఆడవారిలో ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు వాటి సాంద్రతని కోల్పోతాయి. కావున మహిళలు ఈ సమస్యను తగిన ఆహార పదార్థాలతో నయం చేసుకొనుట మేలైన ఉపాయం.* ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, ఓట్మీల్, క్యాబేజీ, బీన్స్, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల క్యాల్షియం ఎక్కువగా పొందవచ్చును. క్యాల్షియం పొందుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండును.* క్యాల్షియం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం కూడా చేస్తే ఈ ఆస్టియోపోరోసిస్ సమస్యను నివారించవచ్చు.* ప్రతిరోజూ ఆహారంలో 400 నుంచి 1200 మి.గ్రా క్యాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి.* మెగ్నీషియం కూడా ప్రతిరోజు ఆహారంలో 500 నుంచి 800 మి.గ్రా పరిమాణంలో తీసుకోవాలి.* ఆకుకూరలు, బ్రకోలీ, కీరదోస, తీయగుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, అవిసె గింజల నుంచి మెగ్నీషియం అధికముగా పొందవచ్చును.