Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
రోజూ పరగడుపున వేడినీటిలో పసుపు కలుపుకుని టీలా తాగితే చెడు కొలెస్ట్రాల్ పరారవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన కొవ్వు కరుగుతుంది. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 
పసుపును నిత్యం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పసుపుకు ఉంది. 
 
పసుపు నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు పసుపులో ఉంటాయి. నిత్యం పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తపు మడుగులో ఎన్నారై భార్యాభర్తలు ... కత్తితో ఒకరినొకరు పొడుచుకున్నారు..