Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడుము నొప్పితో బాధపడేవారు తీసుకోకూడని పదార్థాలు ఏమిటి?

నడుము నొప్పిని కటిశూల లేదా ప్రిష్టశూల అని ఆయుర్వేదంలో అంటారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విషపదార్థాలు బయటకు వెళతాయి. ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని

నడుము నొప్పితో బాధపడేవారు తీసుకోకూడని పదార్థాలు ఏమిటి?
, మంగళవారం, 20 జూన్ 2017 (18:58 IST)
నడుము నొప్పిని కటిశూల లేదా ప్రిష్టశూల అని ఆయుర్వేదంలో అంటారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విషపదార్థాలు బయటకు వెళతాయి. ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని దోషాలూ తగ్గుతాయి. 
 
* ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావుగ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుంనొప్పి తగ్గుతుంది.
 
* పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగనం, కటివస్థ చాలా బాగా ఉపకరిస్తాయి. వస్తి చికిత్స కూడా సహాయపడుతుంది. వంకాయ, వేరుసెనగ నూనె, మినప పదార్థాలు, పెరుగులను నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువుగా తీసుకోవడం మంచింది కాదు.
 
* ఒళ్ళు లావుగా వుండి నడుం నొప్పి వుంటే, పావుగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలూ... మంచివారూ... మంచివారుగా నటించేవారూ ఎలా వుంటారో తెలుసా?