Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుచిగా వుందని ఎక్కువసార్లు తింటే? ఆ పదార్థం ఏం చేస్తుందో తెలుసా?

అజీర్తి కారణంగానే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీర తత్వానికి విరుద్ధ ఆహారపదార్థాలు తీసుకోవడం, శరీర తత్వానికి మించి నీరు తాగడం, రుచిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం, కొన్ని రకాల వ్యాధుల వలన విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి ఆహా

రుచిగా వుందని ఎక్కువసార్లు తింటే? ఆ పదార్థం ఏం చేస్తుందో తెలుసా?
, సోమవారం, 17 జులై 2017 (15:32 IST)
అజీర్తి కారణంగానే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీర తత్వానికి విరుద్ధ ఆహారపదార్థాలు తీసుకోవడం, శరీర తత్వానికి మించి నీరు తాగడం, రుచిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం, కొన్ని రకాల వ్యాధుల వలన విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి ఆహారంగా తీసుకోవడం వలన, రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం మరియు సూర్యాస్తమయం జరిగిన సమయానికి 2 గంటల కంటే కూడా ఎక్కువ సమయం అయిన తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి వ్యాధి తలెత్తుతుంది. 
 
వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే...
కడుపునొప్పి, గొంతులో పుల్లటి త్రేన్పులు, మంటగా అనిపించడం. అతిగా ఆకలి కావడం, తల తిరగడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆకలి లేకపోవడం, అధిక దాహం ఉండటం.
 
ఆయుర్వేద చికిత్స... 
* ఆహారానికి 30 నిమిషాల ముందు దాల్చిన చెక్క నమిలి, ఒక కప్పు మజ్జిగ త్రాగాలి. 
 
* 4 చెంచాల పుదీన రసం ఉదయం, సాయంత్రం ఆహారానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి.
 
* ఈ అజీర్తి ఏ సమయంలో జరిగిందో గుర్తు చేసుకుని ఆ సమయానికి ముందు తీసుకున్న ఆహారం, లేదా నీరు, శీతల పానీయాలు ఏంటని గుర్తు చేసుకుని అలాంటి ఆహార పదార్థాలు వాడకూడదు. 
 
* అల్లం మరియు తేనె లేదా బెల్లము కలిపి లేహ్యం మాదిరిగా చేసి భోజనానికి 15 నిమిషాలు ముందు తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసులోనే టైమంతా కిల్... భార్యతో గొడవలెందుకు? పరిష్కారమేంటి?