Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్తనాలు బిగుతుగా ఉండాలంటే.. లేత మర్రివూడల పొడిని ఇలా ఉపయోగించాలి..

మర్రిచెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఐదు నుంచి పది గ్రాముల మర్రి ఊడలు తింటే.. మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగ

స్తనాలు బిగుతుగా ఉండాలంటే.. లేత మర్రివూడల పొడిని ఇలా ఉపయోగించాలి..
, సోమవారం, 16 జనవరి 2017 (12:37 IST)
మర్రిచెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఐదు నుంచి పది గ్రాముల మర్రి ఊడలు తింటే.. మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగుతుంది. మర్రి ఊడల్ని చిన్న ముక్కలుగా కోసి.. గాలికి ఎండబెట్టి దంచి పొడిచేసుకుని జల్లెడ పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు పూటలా చెంచా మోతాదులో తిని నీరు సేవిస్తే అధిక వేడి తగ్గిపోతుంది. శరీరానికి కాంతి లభిస్తుంది. 
 
మర్రి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్థి కలుగుతుంది. లేత మర్రి వూడలను తెచ్చి మెత్తగా నూరి ఆ ముద్దను చను మొనలు వదిలి చనులకు పూసి కట్టుగట్టి ఉదయం తీసి వేస్తుంటే జారిపోయిన స్తనాలు గట్టిపడతాయి. మర్రివూడలను మంచినీటితో కలిపి కషాయంలా కాచి చల్లార్చి తాగుతుంటే పైత్యం తగ్గిపోయి జ్వరం హరించిపోతుంది.
 
మర్రిచెట్టు లేత వూడల రసం 10 గ్రాములు తీసుకొని దానిలో మెత్తగా నూరిన 5 మిరియాల గంధాన్ని కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే కుష్టు రోగాలు, చర్మరోగాలు దరిచేరవు. లేత మర్రి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువుల్ని తోమితే?