Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నూనెను నీటిలో కలిపి ఇలా చేస్తే.. ఏమవుతుంది..?

ఈ నూనెను నీటిలో కలిపి ఇలా చేస్తే.. ఏమవుతుంది..?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (10:17 IST)
మల్లెపువ్వులు వాసన చాలా బాగుంటుంది. ఈ పువ్వుల వాసన మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే చాలామంది స్త్రీలు మల్లెపువ్వులను పెట్టుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి మల్లెపువ్వులతో తయారుచేసే నూనె ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
మల్లెపువ్వులు స్త్రీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాంటి పువ్వులతో నూనె తయారుచేసుకుని ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా ఈ నూనెను కలుపుకుని స్నానం చేస్తే శరీర నొప్పులు తగ్గుతాయి. ఇప్పటి వేసవికాలంలో మల్లెపువ్వులు ఎక్కువగా దొరుకుతాయి. రెండు చుక్కల మల్లెపువ్వుల నూనెను ఓ శుభ్రమైన వస్త్రంపై వేసుకుని దాని వాసన పీల్చుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే.. శరీర ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా, ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
మల్లెపువ్వుల నూనెను ఫేస్‌వాష్‌లా కూడా వాడుకోవచ్చును. కొన్ని చుక్కల మల్లెపువ్వుల నూనె, కొద్దిగా కొబ్బరినూనెను సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మర్దనా చేసుకోవాలి. కాసేపటి తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతోపాటు చర్మం మృదువుగా కూడా తయారవుతుంది. 
 
కొన్ని చుక్కల మల్లెపువ్వుల నూనెకు కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి శరీర నొప్పులకు రాసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ఆలివ్ నూనెను బదులు వేడినీరు కూడా ఉపయోగించుకోవచ్చును. కానీ వేడి నీటితో అయితే కాపడం పెట్టాల్సి ఉంటుంది. తరచు జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు.. మల్లెపువ్వుల నూనెను జుట్టుకు రాస్తుంటే.. సమస్య తగ్గుముఖం పడుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొంతమంది ముఖాలు ఎంతో అందంగా వుంటాయి... కారణం ఏంటి?