Publish Date: Thu, 12 Nov 2015 (22:26 IST)
Updated Date: Thu, 12 Nov 2015 (22:28 IST)
నాగేంద్రగుప్త-విజయవాడ: మీ కుమారుడు ద్వాదశి శనివారం, కన్యాలగ్నము, అనురాధా నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల స్థిరబుద్ధి లేకపోవడం, చికాకు, మొండితనం, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. నెలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో కానీ తుమ్మి పూలతో కానీ శనిని పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటిన శుభం కలుగుతుంది. 2017 లేక 2018 నందు మీరు బాగుగా స్థిరపడతారు. అప్పుడప్పుడు మీ తండ్రిగారి ఆరోగ్యములో సంతృప్తి కానరాదు. 2022 నుంచి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.