Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గిరిజనులు ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా

Advertiesment
అదిలాబాద్ జిల్లా గిరిజినలు ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మందలమర్రి బొగ్గలగుట్ట పర్యాటక ప్రాంతం
అదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా గాంధారి ఖిల్లా వెలుగొందుతోంది. అంతేకాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని మందలమర్రి, బొగ్గలగుట్ట మధ్యన ఉన్న కొండల్లో ఈ ఖిల్లా వెలసివుంది. ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని మాత్రం అటు పాలకులు, ఇటు ప్రభుత్వ పర్యాటక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu